రాహుల్ గాంధీ ‘మోదీ సరెండర్’ వ్యాఖ్యలకు శశిథరూర్ కౌంటర్
- అమెరికా పర్యటనలో అఖిలపక్ష బృందానికి శశిథరూర్ నాయకత్వం
- భారత్ను ఆపమని ఎవరూ ఒప్పించాల్సిన అవసరం రాలేదన్న కాంగ్రెస్ ఎంపీ
- ‘ఆపరేషన్ సిందూర్’లో మూడో వ్యక్తి ప్రమేయం లేదని స్పష్టీకరణ
- పాక్ ఆగితే తాము ఆగుతామని చెప్పామన్న థరూర్
రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా థరూర్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. "ఆపరేషన్ను ఆపడానికి భారత్ను ఎవరూ ఒప్పించాల్సిన అవసరం రాలేదు. మమ్మల్ని ఆపమని ఎవరూ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే పాకిస్థాన్ ఆపిన మరుక్షణమే మేమూ ఆపడానికి సిద్ధంగా ఉన్నామని వారికే (పాకిస్థాన్కు) మేం చెప్పాం" అని ఆయన వివరించారు.
'భారత్ ఆగడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు కూడా ఆగడం మంచిది' అని పాకిస్థాన్తో అమెరికా చెప్పి ఉంటే అది వారి గొప్పతనం అవుతుందని థరూర్ అభిప్రాయపడ్డారు. "వారు (అమెరికా) అదే చేసి ఉంటే, అది వారి వైపు నుంచి ఒక అద్భుతమైన చర్య" అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, నిర్ణయాత్మక ప్రక్రియలో మాత్రం భారత్ స్వతంత్రంగానే వ్యవహరించిందని, బయటి శక్తుల ప్రమేయం లేదని థరూర్ తేల్చిచెప్పారు.