Chandrababu Naidu: కడప నుంచి నేరుగా ఢిల్లీకి బయల్దేరుతున్న చంద్రబాబు

Chandrababu Naidu to Leave for Delhi After Mahanadu
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని, వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల మహానాడు ఈరోజు ముగియనుంది. అనంతరం, ఈ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు కడప నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

రేపు ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరగనున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య జరగనుంది. రేపు రాత్రి ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు.

శనివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం సీహెచ్ గునేపల్లి గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. వాస్తవానికి ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తుండగా, ఈసారి జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో, ఒక రోజు ముందుగానే అంటే మే 31వ తేదీనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

పింఛన్ల పంపిణీ అనంతరం, సీఎం చంద్రబాబు స్థానిక గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఆ తర్వాత, పార్టీ శ్రేణులతో కూడా ఆయన భేటీ అవుతారు. కార్యక్రమాలన్నీ ముగించుకుని, శనివారం సాయంత్రం 5:15 గంటలకు ముమ్మిడివరం నుంచి విజయవాడకు ముఖ్యమంత్రి తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Mahanadu
CII AGM
Delhi
Rajamundry
Mummidivaram
NTR Bharosa Pension
AP News
Political News

More Telugu News