'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్
- బాలికను వేధింపులకు గురి చేసిన ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
- ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
- ఉపాధ్యాయుడికి మద్దతుగా నిలిచిన వ్యక్తులందరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు
దీనిపై తన కుమార్తెను సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె తండ్రి జనవరి 11న ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా, సంబంధిత సీసీ టీవీ పుటేజీతో పాటు నివేదికను ఉన్నతాధికారులకు పంపగా సదరు ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిపై ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేస్తున్న వారిపైనా అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఒకసారి తమను లూని పంచాయతీ సితి చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషనల్ ఆఫీసుకు తీసుకువెళ్లి అక్కడ అందరూ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని, ఒక వేళ అలా చేయకపోతే, తన కుమార్తెకు టీసీ ఇవ్వబోమని, ఎక్కడా అడ్మిషన్ దొరకదంటూ కూడా బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ బాలిక తండ్రి పేర్కొన్నాడు. దీంతో బాలికను వేధించిన ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బుధవారం మెజిస్ట్రేట్ ముందు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసిన అందరిపైనా కూడా కేసులు నమోదు చేశారు.