సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బన్నీ వాసు పోస్టు
- ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలనిపిస్తోందని బన్నీ వాసు ట్వీట్
- కానీ ఇప్పుడు ఎందుకీ గొడవలు అని వ్యాఖ్య
- దేని గురించి ఈ పోస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ
వివరాల్లోకి వెళితే... బన్నీ వాసు తన సోషల్ మీడియా ఖాతాలో, "ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని అనిపిస్తుంది. కాని ఇప్పుడు ఎందుకీ గొడవలు. శాంతి.. శాంతి.. శాంతి..!" అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే వైరల్గా మారింది. అయితే, ఆయన ఏ విషయంపై అసహనంతో ఉన్నారో, దేని గురించి స్పందించాలనుకున్నారో స్పష్టంగా పేర్కొనలేదు.
అయితే, ఇటీవలే నటుడు శ్రీవిష్ణు నటించిన 'సింగిల్' చిత్ర ట్రైలర్లోని కొన్ని సంభాషణలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా, ట్రైలర్లో శ్రీవిష్ణు 'శివయ్యా..' అని అరవడం, చివర్లో 'మంచు కురిసిపోతుందని' అనడం వంటివి నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీజర్ను, అందులో ఆయన 'శివయ్య' అని పలికిన తీరును వెటకారం చేసేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు 'శాంతి' వ్యాఖ్యతో పోస్ట్ చేశారని, బహుశా ఈ వివాదం గురించే ఆయన పరోక్షంగా స్పందించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.