వేవ్స్ సమ్మిట్ లో మెరిసిన నాగచైతన్య, శోభిత

  • ముంబై వేదికగా వైభవంగా ప్రారంభమైన వేవ్స్ సమ్మిట్
  • హాజరైన సినీ దిగ్గజాలు, స్టార్లు
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చైతూ, శోభిత
ముంబై వేదికగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారతీయ వినోద పరిశ్రమ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌.. కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే నినాదంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరగనుంది.

ఈ ప్రారంభ వేడుకలకు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు, ప్రముఖ తారలు హాజరై సందడి చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా వంటి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యంగా టాలీవుడ్ నుంచి యువ నటుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నాగచైతన్య బ్లాక్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, శోభిత సంప్రదాయ చీరకట్టులో నుదుటన బొట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి తాజా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


More Telugu News