YS Jagan Mohan Reddy: అప్పటిలా కాదు... ఇప్పుడు ప్రతి గ్రామంలో మనం ఉన్నాం: జగన్

Jagans Defiance Were in Every Village Now

  • వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ  సమావేశంలో జగన్ వ్యాఖ్యలు
  • గతంలో తనను 16 నెలుల జైల్లో ఉంచారని వెల్లడి
  • ప్రజలే అండగా నిలిచారని స్పష్టీకరణ
  • ఇప్పుడు కూడా ప్రజలే తీవ్రంగా స్పందిస్తారని ఆశాభావం

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకు గురి చేసినా తాను కానీ, పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తి లేదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో తనను అన్యాయంగా 16 నెలల పాటు జైలులో ఉంచారని, పార్టీని నడపలేని పరిస్థితులు కల్పించినా ప్రజలు తనను, పార్టీని ఆదరించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

పీఏసీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ, "నాడు నన్ను 16 నెలలు జైలులో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారు. అయినా ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. వాళ్లు ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారు. నన్ను మరోసారి జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు" అని అన్నారు. 

గతంలో అక్రమాస్తుల కేసులో తనను అన్యాయంగా ఇరికించి జైలుకు పంపినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అఖండ విజయాన్ని అందించారని జగన్ గుర్తుచేశారు. అదే విధంగా, ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు బనాయించినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని జగన్ ఈ సమావేశం ద్వారా సంకేతాలు పంపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, అది అంతిమంగా తమ పార్టీకే లాభిస్తుందని అభిప్రాయపడ్డారు. 

YS Jagan Mohan Reddy
YCP
Andhra Pradesh Politics
Political Cases
Jail Term
Public Support
TDP Government
PAC Meeting
Opposition
Political Crisis
  • Loading...

More Telugu News