TRF: అబ్బే.. పహల్గామ్ దాడి మా పని కాదు.. ప్లేట్ ఫిరాయించిన టీఆర్ఎఫ్‌!

TRF Denies Responsibility for Pahalgham Attack
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్‌ఎఫ్) పహల్గామ్ ఘ‌ట‌న‌పై తాజాగా సంచలన ప్రకటన విడుద‌ల చేసింది. మొదట ఈ పాశ‌విక‌ దాడి తమ పనే అని ప్రకటించుకున్న టీఆర్‌ఎఫ్... ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి తమ పని కాదని తెలిపింది. తమ వ్యవస్థలను భారత్‌ హ్యాక్‌ చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

"పహల్గామ్ దాడిలో మా ప్రమేయం లేదు. ఈ చర్యను టీఆర్‌ఎఫ్‌కు ఆపాదించడం తొందరపాటు చర్యే అవుతుంది. ఇంతకుముందు వచ్చిన ప్రకటనతో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. భారత్‌ మా వ్యవస్థల్ని హ్యాక్‌ చేసి ఆ సందేశాన్ని పోస్ట్‌ చేసింది. ఇది భారత సైబర్‌-ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌ల పని. దీనిపై మేము పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ ఇలా చేయడం ఇదేమీ మొద‌టిసారి కాదు" అంటూ టీఆర్‌ఎఫ్ ఆరోపించింది.

కాగా, పహల్గామ్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసర‌న్‌లో ఉగ్రవాదులు ఈ నెల 22న నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అడవిలో నుంచి వచ్చిన ముష్క‌రులు సంద‌ర్శ‌కులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. మొద‌ట ఈ దాడి తమ పనే అని ప్ర‌క‌టించుకున్న టీఆర్‌ఎఫ్‌ ఇప్పుడు మాట మారుస్తూ, భారత్‌పై ఆరోపణలు చేయడం గమనార్హం.

Go Back to Shorts
TRF
The Resistance Front
Pahalgham Attack
Terrorism
India
Pakistan
Lashkar-e-Taiba
Cyber attack
Pulwama-like attack
Terrorist attack

More Telugu News