PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపిన కోర్టు

PSR Anjaneyulu Sent to Remand in Jethwani Harassment Case
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీపై వేధింపులకు సంబంధించి నమోదైన కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 7 వరకు పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపుతూ బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. 

పీఎస్‌ఆర్ ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు బుధవారం ఉదయం థర్డ్ ఏసీజేఎమ్‌ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఛాంబర్‌లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట లాయర్‌తో కలిసి పీఎస్ఆర్ స్వయంగా వాదనలు వినిపించారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని వాదించారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తనకూ ఈ కేసుకు సంబంధం లేదని పీఎస్‌ఆర్ తెలిపారు.
Go Back to Shorts
PSR Anjaneyulu
Kadambari Jethwani
AP Intelligence Chief
Remand
Harassment Case
CID Police
Court Hearing
Bollywood Actress
False Case
Andhra Pradesh

More Telugu News