Om Prakash: కర్ణాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి

Karnatakas Former DGP Om Prakash Found Dead Under Suspicious Circumstances

  • బెంగళూరులోని నివాసంలో విగతజీవుడిగా ఓం ప్రకాశ్
  • హత్య అని భావిస్తున్న పోలీసులు
  • ఓ కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉండొచ్చని అనుమానం

కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) అనుమానాస్పద స్థితిలో మరణించారు. బెంగళూరులోని ఆయన నివాసంలో నేడు విగతజీవుడిగా కనిపించారు. హత్య అని అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు, ఇది సహజ మరణం కాకపోవచ్చని, హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉండవచ్చనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

1981 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఓం ప్రకాశ్, బీహార్‌లోని చంపారన్ ప్రాంతానికి చెందినవారు. ఎమ్మెస్సీ (జియాలజీ) విద్యార్హత కలిగిన ఆయన, 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం, ఓం ప్రకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Om Prakash
Karnataka former DGP
Suspicious death
Bengaluru
Murder investigation
Family member involvement
Postmortem report
1981 IPS batch
Bihar
Police investigation
  • Loading...

More Telugu News