మస్క్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్... ఏం మాట్లాడారంటే..!
- మస్క్తో ఫోన్ కాల్లో చర్చలు జరిపినట్లు 'ఎక్స్' వేదికగా తెలిపిన మోదీ
- సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామన్న ప్రధాని
- ఈ ఏడాది ప్రారంభంలో తమ భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్లు వెల్లడి
ఈ ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో భేటీ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన విషయాలు తమ మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొన్నారు. సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని మోదీ అన్నారు. ఈ రంగాలలో భారత్, అమెరికా భాగస్వామ్యం మరింత పురోగమిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతున్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.