PM Modi: మ‌స్క్‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌ కాల్... ఏం మాట్లాడారంటే..!

PM Modi Speaks with Elon Musk Focus on Tech Collaboration
షార్ట్స్‌లో చూడండి
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ట్రంప్ ప్ర‌భుత్వంలోని డోజ్ విభాగపు అధిప‌తి ఎలాన్ మ‌స్క్‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్‌లో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని 'ఎక్స్' (ట్విట్ట‌ర్) ద్వారా వెల్ల‌డించారు. మ‌స్క్‌తో ప‌లు అంశాలపై చ‌ర్చించిన‌ట్లు మోదీ తెలిపారు. 

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వాషింగ్టన్ డీసీలో భేటీ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య జ‌రిగిన విష‌యాలు త‌మ మ‌ధ్య‌ ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై చ‌ర్చించామ‌ని మోదీ అన్నారు. ఈ రంగాల‌లో భార‌త్‌, అమెరికా భాగ‌స్వామ్యం మ‌రింత పురోగ‌మిస్తుంద‌ని ప్ర‌ధాని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కాగా, సుంకాల విష‌యంలో భార‌త్‌, అమెరికా మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌ల అంశం కొన‌సాగుతున్న వేళ ఈ కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 
PM Modi
Elon Musk
Narendra Modi
India-US relations
Technology collaboration
Innovation
Tesla
SpaceX
Trade talks
US-India trade

More Telugu News