దుబాయిలో ఇద్ద‌రు తెలుగోళ్లను దారుణంగా హ‌త్య చేసిన పాకిస్థానీ!

Pakistani National Kills Two Telugu Workers in Dubai
దుబాయిలో తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రిని ఓ పాకిస్థానీ దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. గ‌త శుక్ర‌వారం ఇద్ద‌రు తెలుగోళ్లను పాకిస్థాన్ పౌరుడు అతి కిరాత‌కంగా నరికి చంపాడు. నిర్మ‌ల్ జిల్లా సోన్‌కు చెందిన అష్ట‌పు ప్రేమ్‌సాగ‌ర్ (40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయిలోని ఓ పేరొందిన బేక‌రీలో ప‌నిచేస్తున్నారు. 

అదే బేక‌రీలో ప‌నిచేసే ఓ పాకిస్థానీ ప‌ని ఒత్తిడి, మ‌త విద్వేషంతో వీరిద్ద‌రిని దారుణంగా న‌రికి చంపాడు. ఈ దాడిలో మ‌రో ఇద్ద‌రు తెలుగువారు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంద‌ని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Dubai
Pakistani Killer
Dubai Murders
Telugu Workers
Prem Sagar
Srinivas
Nirmal District
Nizamabad District
Bakery Killing
Hate Crime
Dubai Crime

More Telugu News