Gangareddy: జగిత్యాలలో భారీ అగ్ని ప్రమాదం

Massive Fire Erupts at Rice Mill in Jagtial Telangana

  • మెట్‌పల్లి మండలం కొండ్రికర్లలోని రైస్ మిల్లులో ప్రమాదం
  • మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు
  • రూ.2 కోట్ల విలువైన ఆస్తి దగ్ధం

జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మెట్‌పల్లి మండలం కొండ్రికర్ల గ్రామ శివారులోని మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో శనివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో సుమారు 5 వేల క్వింటాళ్ల వరి ధాన్యం, 85 వేల గోనె సంచులు కాలి బూడిదైనట్లు మిల్లు యజమాని గంగారెడ్డి తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా దాదాపు రూ. 2 కోట్ల విలువైన ఆస్తి నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Gangareddy
Jagtial fire incident
Mahalakshmi Industries
Rice Mill Fire
Metpalli Mandal
Kondrikarla Village
Telangana Fire Accident
Property Damage
Rice Mill
Jagtial
  • Loading...

More Telugu News