పదేళ్లలో 30 బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు.. రైతు ఆత్మహత్య!
- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో విషాదం
- గతంలో 27 బోర్లు వేసిన రైతు, ఈ ఏడాది మరో 3 బోర్లు వేశాడు
- బోర్ల కోసం చేసిన అప్పులు దాదాపు తీర్చేసిన మల్లన్న
- మరో రూ. 5 లక్షల అప్పు ఉండటంతో ఆత్మహత్య
ఈ ఘటనపై ఎస్సై అశోక్ మాట్లాడుతూ, మల్లన్న 30 బోర్లు వేసినా ఒక్క దాంట్లోనూ నీరు పడలేదని తెలిపారు. గతంలో 27 బోర్లు వేసినా ఆయన ప్రయత్నాలు ఆపలేదని, ఈ సంవత్సరం మరో మూడు బోర్లు వేయించినా నీరు లభించలేదని చెప్పారు. బోర్ల కోసం చేసిన అప్పులు దాదాపుగా తీర్చేశాడని, ఇంకా రూ. 5 లక్షల వరకు అప్పు మిగిలి ఉందని పేర్కొన్నారు. మల్లన్నకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురికి వివాహం కాగా, కుమారుడు బ్యాంకు పరీక్షకు సిద్ధమవుతున్నాడు.