పోసానికి నోటీసులు ఇచ్చిన సూళ్లూరుపేట పోలీసులు

  • పవన్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు
  • విచారణకు హాజరు కావాలంటూ పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు
  • ఇప్పటికే రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపిన పోసాని
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట పీఎస్ లో ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని పోసానికి పోలీసులు నోటీసులు అందజేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో సంతకం చేసేందుకు పోసాని వచ్చిన సమయంలో ఈ నోటీసులు అందజేశారు. 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ వ్యాప్తంగా 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన పలు జైళ్లలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. గత నెలలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 


More Telugu News