Telangana Government: ఏఐ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించారు: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్

Telangana Govt Files Petition Against AI Generated Fake Videos
  • కంచ గచ్చిబౌలి భూముల వివాదం
  • జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారన్న ప్రభుత్వం
  • ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మేనక గురుస్వామి
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) సాయంతో నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌ను సృష్టించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు.

భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలను సృష్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
Telangana Government
AI-generated videos
Fake videos
Gachibowli land scam
High Court Petition
Artificial Intelligence
Telangana High Court

More Telugu News