మంత్రి నారా లోకేశ్ చొరవతో గుండెను తరలించేందుకు గ్రీన్ ఛానల్

  • చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్
  • అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు
  • గుంటూరు నుంచి తిరుపతికి గుండె తరలింపు
  • ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేశ్
ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రి నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా ఒక మహిళ గుండెను విజయవంతంగా తరలించారు. చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్ అవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం గుండెను తిరుపతికి తరలించడానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ కు విజ్ఞప్తి చేసింది. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. 

గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రేణిగుంటకు, ఆపై తిరుపతిలోని ఆసుపత్రికి గుండెను తరలించారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం అవసరమైన గ్రీన్ ఛానల్ ఏర్పాటు కోసం లోకేశ్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. 

ఈ సందర్భంగా మృతురాలి భర్త శ్రీనివాస్ మాట్లాడుతూ, తన భార్య అనారోగ్యం బారిన పడి కోమాలోకి వెళ్లారని, అవయవదానం ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సహకారంతో తిరుపతిలో ఉన్న వ్యక్తికి గుండెను అందించడం సంతృప్తిగా ఉందని అన్నారు.

Nara Lokesh
Green Channel
Organ Donation
Heart Transplant
Tirupati
Guntur
Ramesh Hospital
Andhra Pradesh
Air Ambulance
Cherikuri Sushma

More Telugu News