నేడు భారీ విరాళాలు అందుకున్న టీటీడీ
- ఇటీవల టీటీడీకి భారీగా విరాళాలు
- నేడు రూ.2.45 కోట్ల విరాళాలు
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
చెన్నైకి చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు రూ.1 కోటి విరాళం అందించగా, శ్రీలంకకు చెందిన మరో భక్తుడు అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం ఇచ్చాడని బీఆర్ నాయుడు వివరించారు. నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించినట్టు తెలిపారు.