ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ఇంట్లో తీవ్ర విషాదం

AP Minister NMD Farooqs Wife Passes Away
  • మంత్రి ఫరూఖ్ భార్య షహనాజ్ కన్నుమూత
  • తీవ్ర అనారోగ్యంతో మృతి 
  • రేపు నంద్యాలలో అంత్యక్రియలు
ఏపీ మైనారిటీ  శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ భార్య షహనాజ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. షహనాజ్ కొంతకాలంగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తిరిగి కోలుకోలేకపోయారు. ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాల తరలిస్తున్నారు. శనివారం నాడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
NMD Farooq
Andhra Pradesh Minister
Shahanaz Farooq
Wife
Death
Hyderabad
Nandyala
Minority Welfare Minister
AP Politics
Family Tragedy

More Telugu News