తిరుమల దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం ఏమిటి?: రేవంత్రెడ్డి
- శ్రీవారి దర్శనం కోసం ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను అడుక్కోవడమేంటన్న రేవంత్రెడ్డి
- వారికి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్న సీఎం
- తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు రాష్ట్రంలోని ఆలయాలకు వెళ్లాలని సూచన
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. మెక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే రాష్ట్రానికి వచ్చిందని రేవంత్రెడ్డి తెలిపారు.