సునీతా విలియమ్స్ రాకపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- మేం ఎప్పుడో తీసుకొస్తామని చెప్పాం.. బైడెన్ ఒప్పుకోలేదన్న స్పేస్ ఎక్స్ అధినేత
- మా ప్రతిపాదనకు ఒప్పుకుంటే ఇంత ఆలస్యం జరిగేది కాదని వెల్లడి
- మరో సేఫ్ ల్యాండింగ్ అంటూ స్పేస్ ఎక్స్ సిబ్బందికి మస్క్ అభినందనలు
ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన వ్యోమగాములను వాపస్ తీసుకురావడానికి తమ కంపెనీ తరఫున బైడెన్ ప్రభుత్వానికి అప్పట్లోనే ప్రతిపాదన చేశామని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సునీత, బుచ్ లను తీసుకువచ్చేందుకు మరో వ్యోమనౌకను పంపిస్తామని బైడెన్ కు ఆఫర్ ఇచ్చామని, రాజకీయ కారణాలతో ఆయన తిరస్కరించారని మస్క్ ఆరోపించారు. తమ ఆఫర్ కు బైడెన్ అంగీకారం తెలిపి ఉంటే వ్యోమగాములు ఇంతకాలం ఐఎస్ఎస్ లోనే ఉండిపోయే అవసరం ఉండేది కాదని అన్నారు. ఏదేమైనా సునీత, బుచ్ విల్మోర్ లు క్షేమంగా భూమికి తిరిగి రావడం సంతోషకరమని మస్క్ చెప్పారు. వ్యోమగాములను వెనక్కి తీసుకువచ్చే ఆపరేషన్ లో పాలుపంచుకున్న నాసా, స్పేస్ ఎక్స్ సిబ్బందికి మస్క్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.