నటి రన్యారావు వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి ఫొటో!
- దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తెస్తూ దొరికిపోయిన రన్యారావు
- వెలుగులోకి వచ్చిన ఫొటోలో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర కూడా
- ఫొటోను షేర్ చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయ
- స్మగ్లింగ్లో సీఎం సిద్ధరామయ్య పాత్రపై అనుమానాలు
దుబాయ్ నుంచి 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ రన్యారావు ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. తరచూ ఒకే రకమైన దుస్తులతో ఆమె దుబాయ్ వెళ్లడంతో అనుమానించిన అధికారులు నిఘా ఉంచగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు స్మగ్లింగ్లో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పెళ్లికి హాజరైన అతిథులు, వారిచ్చిన కానుకలపై ఆరా తీస్తుండగా ఈ ఫొటో వెలుగులోకి వచ్చింది. దీంతో స్మగ్లింగ్లో ఆయన పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, విమానాశ్రయంలో తనిఖీల సమయంలో తప్పించుకునేందుకు సాయం చేసిన అధికారికి, సంబంధిత శాఖ అధికారుల నుంచి సూచనలు అందాయని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కోర్టుకు తెలిపింది.