నేటి నుంచి తిరుమల అన్నప్రసాదం మెనూలో వడలు
- వడలు వడ్డిస్తామని గతంలోనే చెప్పిన బీఆర్ నాయుడు
- నేటి నుంచి అమలు
- రోజుకు 35 వేల వడలు వడ్డిస్తామన్న టీటీడీ చైర్మన్
"అధికారులు నాణ్యమైన దినుసులతో రూపొందించిన రుచికరమైన అన్నప్రసాదాలను భక్తులకు వడ్డిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాదంలో వడలు వడ్డిస్తాం. రోజుకు 35 వేల వడలు వడ్డిస్తాం. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తాం" అని బీఆర్ నాయుడు వివరించారు.


