'మహా భక్తి చానల్' ప్రారంభోత్సవానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు
నేడు శివరాత్రి సందర్భంగా గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ వద్ద మహా భక్తి చానల్ ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన రుద్రాభిషేకంలోనూ పాల్గొన్నారు. కాగా, చానల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నిరంజని అఖాడా మహామండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి జీ మహరాజ్ కు చంద్రబాబు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు.
ఇటీవల మహా గ్రూప్ అధినేత మహా న్యూస్ వంశీ మాట్లాడుతూ... ఆ దేవుడు ఆదేశించాడు... ఈ మహా వంశీ పాటిస్తున్నాడు... అంటూ తమ మహా భక్తి చానల్ ప్రారంభోత్సవంపై వ్యాఖ్యానించారు.