ఇండియాలో మరెవరినో గెలిపించేందుకు అమెరికా నిధులు.. బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల నిధులు
- వీటిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’
- భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తామెందుకు నిధులివ్వాలన్న ట్రంప్
సౌదీ అరేబియా ప్రభుత్వ మద్దతుతో మియామిలో నిర్వహించిన ఎఫ్ఐఐ ప్రియారిటీ సదస్సులో పాల్గొన్న ట్రంప్ గత రాత్రి మాట్లాడుతూ.. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. భారత్లో ‘మరెవరినో’ గెలిపించేందుకు వారు (బైడెన్ ప్రభుత్వం) ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయాన్ని భారత్కు చెప్పాలని, అదే కీలక ముందడుగు అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. మంగళవారం కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత ఆర్థిక స్థితి బాగుందని, ఆ దేశం వద్ద బోల్డంత డబ్బు ఉందని పేర్కొన్న ట్రంప్ తామెందుకు నిధులు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.