కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు.. కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు
- ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి
- రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన రైల్వేశాఖ
- రైలు ప్లాట్ఫాంపైకి వచ్చే వరకు ప్రయాణికులకు లోపలికి అనుమతి నిల్
- నిన్న ఒక్క రోజే ప్రయాగ్రాజ్కు 1.36 కోట్ల మంది
- ఇప్పటి వరకు మొత్తం 52.83 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు
అయోధ్య రైల్వే స్టేషన్కు ప్రతి రోజు లక్షన్నర మంది వస్తున్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో వీరి కోసం ప్రత్యేకంగా ఎంట్రీ, ఎగ్జిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో అయోధ్య వెళ్లే ప్రత్యేక రైళ్లన్నీ ఫ్లాట్ఫాం నంబర్ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయానికి 1.36 కోట్ల మంది ప్రయాగ్రాజ్ వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 52.83 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినట్టు పేర్కొంది. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా ప్రదేశాల్లో పోలీసులతోపాటు జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.