మీలో మీరే మరింతగా కొట్టుకొని అంతం చేసుకోండి: ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
- 48 స్థానాలు గెలిచిన బీజేపీ, 22 స్థానాలకు పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ
- కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి ఒమర్ అబ్దుల్లా ట్వీట్
ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. "మీకు నచ్చినట్లుగా మరింతగా కొట్టుకోండి, ఒకరిని ఒకరు అంతం చేసుకోండి" అంటూ చురక అంటించారు. ఆయన ఎక్స్ వేదికగా రెండు పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ మీమ్ను జోడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది.