మీలో మీరే మరింతగా కొట్టుకొని అంతం చేసుకోండి: ఢిల్లీ ఫలితాలపై ఒమర్ అబ్దుల్లా

Omar Abdulla on Delhi Assembly results
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
  • 48 స్థానాలు గెలిచిన బీజేపీ, 22 స్థానాలకు పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ
  • కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి ఒమర్ అబ్దుల్లా ట్వీట్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి ఓటమిని చవి చూశాయి.

ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. "మీకు నచ్చినట్లుగా మరింతగా కొట్టుకోండి, ఒకరిని ఒకరు అంతం చేసుకోండి" అంటూ చురక అంటించారు. ఆయన ఎక్స్ వేదికగా రెండు పార్టీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ మీమ్‌ను జోడించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది.
Advertisement
Omar Abdullah
BJP
Congress
AAP

More Telugu News