తండేల్ టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదు: నిర్మాత అల్లు అరవింద్
- తండేల్ సినిమా టికెట్ ధరలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే అడిగామన్న అరవింద్
- తెలంగాణలో టికెట్ ధరలు పెరిగే ఉన్నందున ధరలు పెంచాలని కోరలేదని వివరణ
- నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న తండేల్
సినిమా విడుదల సందర్భఁగా చిత్ర బృందం గురువారం విలేఖరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు తక్కువగా ఉన్నందున అక్కడ మాత్రమే టికెట్ ధరలను పెంచాలని కోరినట్లు, అది కూడా టికెట్పై రూ.50 మాత్రమే పెంచమని అభ్యర్థించినట్లు తెలిపారు. తెలంగాణలో టికెట్ ధరలు ఇప్పటికే రూ.295, 395గా ఉన్నందున, ఇక్కడ టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాన్ని కోరలేదని ఆయన పేర్కొన్నారు.