అప్పట్లో పుతిన్ ను చంపేందుకు ప్రయత్నించారు.. బైడెన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు
- అమెరికా రాజకీయ విశ్లేషకుడు కార్ల్ సన్ తాజా వ్యాఖ్యలు
- దీనికి బలమైన ఆధారాలు లేవని ఒప్పుకున్న కార్ల్ సన్
- మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించడమే లక్ష్యంగా పలు కుట్రలు చేశారని ఆరోపణ
అయినప్పటికీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పై కార్ల్ సన్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. కాగా, ఫాక్స్ న్యూస్ యాంకర్ గా పేరొందిన కార్ల్ సన్ 2023లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ‘ది టకర్ కార్ల్ సన్ షో’ పేరుతో పాడ్ కాస్ట్ చేస్తూ అమెరికాతో పాటు ప్రపంచ రాజకీయాలపై తన విశ్లేషణలను శ్రోతలకు వెల్లడిస్తున్నారు. కాగా, కార్ల్ సన్ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు స్పందించలేదు. రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రెసిడెంట్ పుతిన్ కు రష్యన్ స్పెషల్ సర్వీస్ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మార్పులు చేస్తోందని వివరించారు.