'1ఎం1బీ' సంస్థ సేవలు ప్రశంసనీయం: ఏపీ సీఎం చంద్రబాబు
- కుప్పంలో గ్రీన్ స్కిల్ అకాడమీ, కెరీర్ రెడీనెస్ సెంటర్ ఏర్పాటు చేసిన 1ఎం 1బీ సంస్థ
- ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసిన సంస్థ ప్రతినిధులు
- వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ ద్వారా 50 వేల మందికి శిక్షణ అందిస్తారన్న సీఎం
రాయలసీమలోని ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమిదని ఆయన తెలిపారు. సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ ద్వారా 50 వేల మందికి శిక్షణ అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో వంద మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడంతోపాటు 30 వేల మంది యువతకు ఉద్యోగాలు, ఇంటర్న్షిప్లు కల్పిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కుప్పం సెంటర్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు జత చేశారు.