రంజీ బరిలో విరాట్ కోహ్లీ... అభిమానులకు బ్యాడ్ న్యూస్!
- గురువారం నుంచి రైల్వేస్ జట్టుతో ఢిల్లీ రంజీ మ్యాచ్
- 13 ఏళ్ల రంజీ బరిలో దిగుతున్న రన్మెషీన్
- అయితే, ఈ మ్యాచ్ లైవ్ కవరేజీపై సందిగ్ధత
- బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఢిల్లీ క్రికెట్ సంఘం వెల్లడి
కాగా, తమ అభిమాన ప్లేయర్ ఆటను టీవీల్లో వీక్షించాలనుకునే అభిమానులకు షాక్ తగలనుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లైవ్ కవరేజీ ఉండకపోవచ్చని సమాచారం. ఇప్పటివరకైతే బీసీసీఐ ఈ మ్యాచ్ లైవ్ కవరేజీపై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయంపై తాజాగా ఢిల్లీ క్రికెట్ సంఘం స్పందించింది.
"బీసీసీఐ ఏమైనా చివరి నిమిషంలో లైవ్ కవరేజీకి ఏర్పాట్లు చేస్తుందేమో తెలియదు. ఇప్పటివరకైతే మాకు ఎలాంటి సమాచారం లేదు. కామన్గానైతే పెద్ద మ్యాచ్లకు లైవ్ టెలీకాస్ట్ లేదా ఓటీటీ స్ట్రీమింగ్కు ఇచ్చే అవకాశం ఉంటుంది. బ్రాడ్కాస్టర్ను రోస్టర్ పద్ధతిలో చేసేందుకు ముందుగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది" అని సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఇక లైవ్ ఇవ్వడానికి కావాల్సిన సిస్టమ్ను ఏర్పాటు చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. మల్టీ కెమెరా సెటప్ను రెడీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ మ్యాచ్ కు రెండు రోజులే మిగిలాయి. దీంతో ఈ మ్యాచ్ లైవ్ కవరేజీ ఉంటుందా? ఉండదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.