అత్యంత చెత్తగా ముగిసిన పాకిస్థాన్ డబ్ల్యూటీసీ ప్రయాణం!
- డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అట్టడుగున పాకిస్థాన్ జట్టు
- డబ్ల్యూటీసీలో ఆ జట్టుకు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన
- జాబితాలో అగ్రస్థానంలో సౌతాఫ్రికా, రెండో స్థానంలో ఆసీస్
ఈ ఓటమితో పాకిస్థాన్ జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2023/25 సైకిల్లో 14 టెస్టులు ఆడిన పాక్ 5 మాత్రమే గెలిచి 9 టెస్టుల్లో పరాజయం పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 27.89 శాతం పాయింట్లతో కింది నుంచి మొదటి స్థానంలో నిలిచింది. డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్థాన్కు ఇదే అత్యంత చెత్త ప్రదర్శన.
డబ్ల్యూటీసీ ప్రారంభ ఎడిషన్లో ఆరు మ్యాచుల్లో మూడింటిలో గెలిచిన పాక్ 43.3 శాతం పాయింట్లు సాధించింది. ఆ తర్వాతి ఎడిషన్ (2021/23)లో నాలుగు మ్యాచుల్లో మాత్రమే గెలిచి 38.1 పాయింట్ల శాతంతో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఏకంగా అట్టడుగున నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో సౌతాఫ్రికా 69.44 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (63.73), ఇండియా (50) వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.