రెండు నెలల పాటు జరిగే... కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం
- సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం ప్రారంభం
- ఉగాదికి ముందు ఆదివారం ముగియనున్న జాతర
- స్వామి వారి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు
ఈ ఆలయంలో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పిస్తారు. పట్నం వేసి స్వామి వారి కల్యాణం జరిపించి మొక్కు తీర్చుకుంటారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు తరలి వస్తారు.
భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వాటిపై చలువ పందిళ్లు వేయించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవల రసీదుల అందజేత కేంద్రం వద్ద పక్కా క్యూలైన్లు నిర్మించారు.