కేటీఆర్ ను ఈడీ విచారిస్తున్న వేళ ఢిల్లీకి బయల్దేరిన హరీశ్ రావు!
---
ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు తిరస్కరించింది. దీనిపై కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలలో కలగజేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలో గురువారం కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో ఈ రోజు కేటీఆర్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.