ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు
- ఆసుపత్రిని అణువణువునా పరిశీలించిన మంత్రి నాదెండ్ల
- టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై సంబంధిత అధికారులను నిలదీసిన మంత్రి
- రోగులను అడిగి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుసుకున్న మంత్రి
వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు సమయానికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు.
నెల రోజుల్లో ఆసుపత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తన ఆకస్మిక పర్యటనలో భాగంగా ఆసుపత్రిలో వివిధ విభాగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ క్షుణ్ణంగా పరిశీలించారు.