ఏపీలో కోడిపుంజులతోనే కాదు... పందులతోనూ పందాలు.... వీడియో ఇదిగో!
- సంక్రాంతి సీజన్ అంటే కోడిపందాలకు ఫేమస్
- తాడేపల్లిగూడెం మండలంలో పందుల పందాలు
- తరతరాలుగా వస్తున్న ఆచారం అంటున్న నిర్వాహకులు
అయితే, ఇదే సందట్లో పందుల పందాలు కూడా నిర్వహించడం విశేషం. ఈ పందుల పందాలకు తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామం వేదికగా నిలిచింది. దేశవాళీ పందులు, సీమ పందులు.... ఇలా వేర్వేరు జాతుల పందులను బరిలో దింపి, పోటీలు నిర్వహించారు. ఆ వరాహాలు పౌరుషంతో పోరాడుతుండగా, జనాలు ఎంచక్కా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
కాగా, పందుల పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదని, పందుల పోటీలు నిర్వహించడం తమకు తరతరాలుగా వస్తున్న ఆచారం అని నిర్వాహకులు చెబుతున్నారు.