కిరాణా వ్యాపారి కిడ్నాప్.. రూ. 10 లక్షల డిమాండ్
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
- ఇవ్వాల్సిన రూ. లక్ష ఇస్తామని బాధితుడిని హైదరాబాద్ పిలిపించిన నిందితులు
- హైదరాబాద్లో ఓ అపార్ట్మెంట్లో బాధితుడిని బంధించిన కిడ్నాపర్లు
- ఆయన భార్యకు ఫోన్ చేసి రూ. 10 లక్షల డిమాండ్
- రంగంలోకి దిగి బాధితుడిని రక్షించిన పోలీసులు
అక్కడ ఇద్దరు వ్యక్తులు రమేశ్ను కలిసి ఓ అపార్ట్మెంట్కు తీసుకెళ్లి బంధించి హింసించారు. అనంతరం ఆయన భార్యకు ఫోన్ చేసి రమేశ్ను కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే రూ. 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు రమేశ్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి రక్షించారు. అనంతరం గద్వాల తీసుకొచ్చారు. కిడ్నాపర్లలో శాంతినగర్కు చెందిన ఓ మొబైల్ షాప్ యజమాని, కల్కుంట గ్రామానికి చెందిన వ్యక్తితోపాటు హైదరాబాద్కు చెందిన ముగ్గురు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నేడు వెల్లడించనున్నట్టు పోలీసులు తెలిపారు.