మెల్బోర్న్ టెస్ట్.. కష్టాల్లో భారత జట్టు
ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసిన భారత జట్టు ఆస్ట్రేలియా కంటే 246 పరుగులు వెనుకబడి ఉంది. నితీశ్కుమార్ రెడ్డి (28), వాషింగ్టన్ సుందర్ (1) క్రీజులో ఉన్నారు. భారత్ కోల్పోయిన ఏడు వికెట్లలో స్కాట్ బోలాండ్కు మూడు దక్కగా, కెప్టెన్ పాట్ కమిన్స్కు రెండు దక్కాయి. నాథన్ లియాన్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులు చేసింది.