నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈరోజు సెలవు
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
- అలాగే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలు
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి (డిసెంబరు 27) ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలి భేటీ కానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు.