రష్యన్ జనరల్ చివరి క్షణాలు.. వీడియో ఇదిగో!
- చంపింది తామేనని ప్రకటించిన ఉక్రెయిన్
- ఎస్ బీయూ ఏజెంట్లు బాంబు అమర్చారని వెల్లడి
- తమపై రసాయనిక ఆయుధాలు ప్రయోగించినందుకేనని వివరణ
కాగా, ఇగోర్ కిరిల్లోవ్ ను తామే హత్య చేసినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. తమ భూభాగంపై నిషేధిత రసాయనిక ఆయుధాల ప్రయోగానికి కిరిల్లోవ్ అనుమతించారని ఆరోపించాయి. దీనికి ప్రతీకారంగానే ఆయనను తుదముట్టించినట్లు వెల్లడించాయి. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ (ఎస్ బీయూ) ఏజెంట్లు మాస్కోలోని కిరిల్లోవ్ నివాసం ముందు స్కూటర్ బాంబును ప్లాంట్ చేశారని తెలిపాయి. ఈమేరకు ఎస్ బీయూ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.