53 Bars: ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

andhra pradesh excise department issues re notification to 53 bars
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వేలం నిర్వహిస్తారు. 

ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు. ఈ బార్లకు లైసెన్సు గడువు 2025 అగస్టు వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు బార్‌లకు సంబంధించి వేలం నిర్వహించగా, కొన్ని బార్లు మిగిలిపోయాయి. వీటికి తాజాగా వేలం నిర్వహిస్తున్నారు. 

ఈ బార్లకు సంబంధించి నాన్ రిఫండబుల్ ఫీజు విషయానికి వస్తే .. 50 వేల జనాభా లోపు ఉన్న ప్రాంతాలలో బార్లకు రూ.5లక్షలుగా నిర్ణయించారు. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు రూ.7.5 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాలలో బార్లకు రూ.10 లక్షలుగా ఫీజు నిర్ధారించారు. 
Go Back to Shorts
53 Bars
excise department
re notification
Andhra Pradesh

More Telugu News