జగన్కు మరో షాక్.. నేడు టీడీపీలో చేరనున్న 8 మంది కడప కార్పొరేటర్లు
- నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం
- ఇప్పటికే విజయవాడ చేరుకున్న కార్పొరేటర్లు
- కడప ఎంపీ అవినాష్రెడ్డి రంగంలోకి దిగినా ఫలితం శూన్యం
కడప కార్పొరేషన్కు చెందిన 8 మంది కార్పొరేటర్లు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వీరందరూ ఇప్పటికే విజయవాడ కూడా చేరుకున్నారు. పార్టీ మారుతున్న వారిలో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు వరుసకు సోదరుడు అవుతారు. అలాగే, మహిళా కార్పొరేటర్ ఒకరు ఉన్నారు. మేయర్ సురేశ్బాబుకు కంచుకోట లాంటి చిన్నచౌకులో మెజార్టీ కార్పొరేటర్లు పార్టీ మారుతుండటంతో వైసీపీలో కలవరం మొదలైంది. వీరిని నిలువరించేందుకు కడప ఎంపీ అవినాష్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది.