రష్యా అధ్యక్షుడు పుతిన్ తో రాజ్ నాథ్ సింగ్ కీలక భేటీ
- మూడు రోజుల రష్యా పర్యటనలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
- ఇరుదేశాల రక్షణ సంబంధాలపై కూలంకషంగా చర్చించామన్న రాజ్నాథ్ సింగ్
- రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందని స్పష్టం చేసిన రాజ్నాథ్ సింగ్
భారత్, రష్యా మధ్య స్నేహబంధం శిఖరం కంటే ఎత్తైనదని, సముద్రం కన్నా లోతైనదని మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇరు దేశాల రక్షణ సంబంధాలపై కూలంకషంగా చర్చించామని, రెండు దేశాలకు లబ్ధి చేకూరేలా రక్షణ రంగంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్ఠమయ్యేలా చర్యలు తీసుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయని పేర్కొన్నారు.
రాజ్నాథ్ తాజా పర్యటన నేపథ్యంలో రష్యాలోని భారత దౌత్య కార్యాలయం స్పందిస్తూ .. భారత్ - రష్యా సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని వెల్లడించింది.