'ఛలో ఢిల్లీ' కార్యక్రమం విరమించుకున్న రైతులు
- పంటలకు మద్దతు ధర చట్టబద్ధం చేయాలంటున్న పంజాబ్ రైతులు
- ఛలో ఢిల్లీ కార్యాచరణకు పిలుపు
- గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో శంభు వద్ద ఉద్రిక్తతలు
- ఇవాళ రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
- పలువురు రైతులకు గాయాలు
రైతులను నిలువరించేందుకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. రైతులు కూడా కదం తొక్కుతుండడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందన్న దానిపై ఆందోళన నెలకొంది. అయితే, పరిస్థితిని అంచనా వేసిన రైతులు 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం విరమించుకున్నారు. కొందరు రైతులు గాయపడిన నేపథ్యంలో, ముందుకు వెళ్లకపోవడమే మంచిదని రైతు సంఘాల నేతలు నిర్ణయించుకున్నారు.