తెలంగాణలో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!
- యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి జలాల్పూర్ వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు
- కారు చెరువులో మునగడంతో ఐదుగురు యువకుల మృతి
- మృతులు హైదరాబాద్కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీగా గుర్తింపు
- హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా దుర్ఘటన
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీగా పోలీసులు గుర్తించారు.