వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
- భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
- బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
- తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
సునీత పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. ప్రతివాదులు భాస్కర్ రెడ్డి, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ దాఖలు చేసిన భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ను సునీత పిటిషన్ తో జతచేస్తూ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.