సీఎంగా తొలిసారి 'గజ్వేల్'లో రేవంత్ రెడ్డి పర్యటన... కోకాకోలా ప్లాంట్ ప్రారంభం
- సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్లో ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం
- ప్లాంట్ అంతా కలియదిరిగిన ముఖ్యమంత్రి
- కూల్ డ్రింక్ తయారీ వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం
సిద్దిపేట జిల్లాలోని బండతిమ్మాపూర్లో హెచ్ఎస్ఎస్బీ కోకాకోలా ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కోకాకోలా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం అంతా కలియదిరిగారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు.