పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ దూరం
- ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ శర్మ అర్ధాంగి
- మరికొన్నిరోజుల పాటు భారత్ లోనే ఉండనున్న హిట్ మ్యాన్
- నవంబరు 22 నుంచి టీమిండియా-ఆసీస్ తొలి టెస్టు
రెండో టెస్టుకు ముందు జరిగే వార్మప్ మ్యాచ్ సమయానికి రోహిత్ శర్మ జట్టుతో చేరే అవకాశాలున్నాయి. ఇక, రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో... టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ కు జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాక్టీసు మ్యాచ్ లో గాయపడిన కేఎల్ రాహుల్... మళ్లీ మైదానంలోకి దిగడం టీమిండియాకు ఊరటనిచ్చింది.