నైజీరియా చేరుకున్న మోదీ.. వందేమాతరం నినాదాలతో ఘన స్వాగతం
- తొలిసారి నైజీరియాలో పర్యటిస్తున్న మోదీ
- నైజీరియా దేశాధ్యక్షుడితో భేటీ కానున్న మోదీ
- నైజీరియా నుంచి బ్రెజిల్ కు బయల్దేరనున్న ప్రధాని
మరోవైపు ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ... నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీ ఇంత ఆత్మీయంగా, ఉత్సాహభరితంగా స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ తో భేటీ అవుతారు. సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. నైజీరియా నుంచి మోదీ బ్రెజిల్ కు బయల్దేరుతారు. బ్రెజిల్ లో రేపు జీ20 సదస్సులో పాల్గొంటారు. ఎల్లుండి గయానాలో పర్యటిస్తారు. ఈ నెల 21 వరకు మోదీ గయానాలో ఉంటారు.