అభివృద్ధి లక్ష్యంగా వేసే అడుగులకు సైనికులే రక్షకులు: ప్రధాని మోదీ
- అంగుళం భూమి విషయంలోనూ రాజీపడేది లేదన్న ప్రధాని
- సైనికులపై దేశ ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉందని వ్యాఖ్య
- సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని ప్రజలు భావిస్తున్నారన్న మోదీ
భారత్ ఎప్పుడూ తన శత్రువుల మాటలను వినదని... సైనికుల దృఢ నిశ్చయాన్ని మాత్రమే విశ్వసిస్తుందన్నారు. సైనికుల వల్లే దేశం సురక్షితంగా ఉందని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వేర్వేరుగా ఉన్నప్పటికీ త్రివిధ దళాలు ఒక్కచోట చేరితే మన శక్తిసామర్థ్యాలు పెరుగుతాయన్నారు.