ఈ విధంగా వందలాది మంది రావాల్సిన అవసరం ఎందుకొచ్చింది?: ప్రవీణ్ కుమార్
- ఆందోళనలు చేపడుతున్న పోలీసుల కుటుంబ సభ్యులు
- వన్ పోలీస్ హామీ అమలు చేయాలని డిమాండ్
- నేడు సచివాలయ ముట్టడి
- వీడియో పంచుకున్న బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్
బెటాలియన్లలో పనిచేసే పోలీసుల కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వన్ పోలీస్ హామీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకే దగ్గర విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వారు నేడు సచివాలయ ముట్టడికి యత్నించారు.
వాళ్ల బాధలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతోందని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అన్నదమ్ముల మధ్య పంచాయితీ పెట్టి చోద్యం చేస్తున్నారు సీఎం గారూ అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల కుటుంబ సభ్యులు సెక్రటేరియట్ దిశగా పరుగులు తీస్తున్న వీడియోను కూడా ప్రవీణ్ కుమార్ పంచుకున్నారు.